నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by  |
raja-singh
X

దిశ, వెబ్‌డెస్క్ : తన ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల ఫోన్ కాల్స్, వాట్సాప్ కూడా ట్యాప్ చేస్తున్నదని ఆరోపించారు. మంత్రి హరీశ్ రావు వాట్సాప్ చాటింగ్ కూడా ట్యాపింగ్‌కు గురైందని, ఆ విషయం ఆర్థిక మంత్రికి కూడా తెలుసునన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. రాష్ట్రంలో బండి సంజయ్ పాదయాత్రతో మిగతా పార్టీల్లో భయం పట్టుకుందన్నారు. అందువల్లే అధికారపార్టీ తమ ఫోన్ కాల్స్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.


Next Story

Most Viewed