- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండలో హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే ఆవును 4రోజుల కిందట తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా ప్రమేయం ఉందంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులతో కాకుండా ప్రత్యేకంగా స్పెషల్ టీంను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సానియా మీర్జా ఫామ్హౌస్లో స్వయంగా ఆమెనే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో స్థానిక పీఎస్లో కేసు కూడా నమోదు అయిందని తెలిపారు. గోమాతపై జరిపిన కాల్పుల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా ఆవును చంపిన కేసులో ఫామ్హౌజ్ సెక్యూరిటీ ఇన్చార్జి ఉమర్ పేరు వినబడుతున్నప్పటికీ ఇందులో సానియా ప్రమేయం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారని తెలిపారు.