ప్రభుత్వంపై ఒత్తిడితోనే దుబ్బాక అభివృద్ధి: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by  |
ప్రభుత్వంపై ఒత్తిడితోనే దుబ్బాక అభివృద్ధి: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, దుబ్బాక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై ప్రజలు ఏ విధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారో హుజూరాబాద్ ఎన్నికల ఫలితమే సరైన సమాధానం అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య భవనంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు రావాలని చురకలు వేశారు. అందుకు నిదర్శనమే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం అంటూ గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా, ఎంత డబ్బు పంచినా ప్రజలు చైతన్యవంతులని, ఎవరికి ఓటేయాలో, ఎవరిని గెలిపించాలో వారికే పట్టం కట్టారని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు, మంత్రిగా చేసిన వారు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే.. ప్రభుత్వంపై ఒత్తడి చేస్తే అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.


Next Story

Most Viewed