వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

by  |
Prakashgoud1
X

దిశ‌, గండిపేట్: నార్సింగి మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ‌ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శ‌నివారం నార్సింగి మున్సిప‌ల్‌ కార్యాలయంలో రూ.15 లక్షల వ్యయంతో నూతన వైకుంఠ రథాన్ని చైర్ పర్సన్ రేఖాయాదగిరితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వైకుంఠ ర‌థాన్ని కేటాయించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, కమిషనర్ సత్యబాబు, స్థానిక కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story