సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

by  |
సీఎం సహాయ నిధి పేదలకు ఓ వరం: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
X

దిశ, శంషాబాద్ : ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన 6 లక్షల 74 వేల రూపాయల చెక్కులను శనివారం నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని అప్పుడు ఆపదలో ఉన్న వారికి అందరికీ అందేది కాదని అన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మురళి యాదవ్, ప్రవీణ్ గౌడ్, అజయ్, జ్ఞానేశ్వర్ యాదవ్, తాజ్ బాబా, మంచెర్ల శ్రీనివాస్, రమేష్‌, ప్రభాకర్, రాజేందర్, హన్మంతు, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed