ఎవరినీ బెదిరించలేదు : ఎమ్మెల్యే ప్రభు

by  |
ఎవరినీ బెదిరించలేదు : ఎమ్మెల్యే ప్రభు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రేమ వివాహం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యే ప్రభు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన కూతురును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని మంగళవారం ప్రభు భార్య సౌందర్య తండ్రి ఆత్మహత్యాయత్నం చేశారు. తాజాగా దీనిపై ఎమ్మెల్యే ప్రభు స్పందిస్తూ…

‘గత నాలుగు నెలలుగా నేను , సౌందర్య ప్రేమించుకుంటున్నాం. సౌందర్యను వివాహం చేసుకోవాలని నా తల్లి దండ్రులతో సౌందర్య ఇంటికి వెళ్ళాను. సౌందర్య తండ్రి స్వామినాథన్ గారు మా పెళ్ళికి అంగీకరించలేదు. అప్పుడు మేము నా తల్లిదండ్రుల అనుమతితో ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నేను ఎవరినీ రౌడీలతో బెదిరించి పెళ్లి చేసుకోలేదు.’ అని ట్విట్టర్ వేదికగా ప్రభు ఓ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed