ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్

by  |
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్
X

దిశ, వెబ్‌డెస్క్ : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి యశ్వంతాపుర్ మాజీ సర్పంచ్ సుశీలమ్మ మధ్య వివాదం ముదురుతోంది. జనగామ మురుగునీటిని స్వచ్ఛమైన నీరుపారే యశ్వంతాపుర్ చెరువు వాగులోకి వదలొద్దని రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామస్తులు బంద్ నిర్వహించి ఎమ్మెల్యే ఆక్రమించి నిర్మించిన ప్రహరీని కూల్చివేశారు. శనివారం సైతం వివాదం చోటుచేసుకుంది. గ్రామస్తులకు వ్యతిరేఖంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేలపై పడుకొని నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సమంజసం కాదని మాజీ సర్పంచ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా యశ్వంతాపుర్ మాజీ సర్పంచ్ సుశీలమ్మది కూడా టీఆర్ఎస్ పార్టీనే కావడం గమనార్హం. ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే భూకబ్జాను అడ్డుకోవడంతో గ్రామస్తులంతా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంతకూ అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలియాలంటే ఈ కింది వీడియోను చూడండి.



Next Story

Most Viewed