ఉదారతను చాటుకున్న ఎమ్మెల్యే మేడా.. వరద బాధితులకు ఆర్థికసాయం

by  |
Mehda
X

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు. చెయ్యేరు వరద ఉదృతిలో నష్టపొయిన వారికి సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేశారు.

వరద నీటితో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.10 వేలు, చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. మృతులకు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియోను పెంచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేడా తెలిపారు. రాజంపేటలోని తన నివాసంలో వరద బాధితులకు దాదాపు పది వేల మందికి అన్నదానం నిర్వహించారు.



Next Story

Most Viewed