అమ్మవారి ఊరేగింపులో డాన్స్ ఇరగదీసిన ఎమ్మెల్యే మైనంపల్లి(వీడియో)

by  |
Minister Talsani, MLA Mainampalli
X

దిశ, అల్వాల్: హైదరాబాద్ నగరంలో బోనాలు ఉత్సవాలు అంబరాన్నంటాయి. రెండ్రోజులుగా నగరం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఇందులో భాగంగా సోమవారం గోషామహాల్ అమ్మవారి ఫలహారం బండి ఉరేగింపు అట్టహాసంగా జరగింది. ఈ ఊరేగింపులో ముఖ్య అతిథిలుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని, ఎమ్మెల్యే మైనంపల్లి కళాకారులతో పాటు డాన్సులు చేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాస్ డాన్స్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.


Next Story