టీఆర్ఎస్ వైపే దుబ్బాక ప్రజలు : ఎమ్మెల్యే

by  |
టీఆర్ఎస్ వైపే దుబ్బాక ప్రజలు : ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మాయ మాటలు చెప్పి బీజేపీ పేద ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ వైపై ఉన్నారని, గెలుపు ఖాయం అన్నారు.

Next Story

Most Viewed