ప్రజా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తా.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 

by  |
vivekanand
X

దిశ, కుత్బుల్లాపూర్: ప్రజా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తానని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని శ్రీనివాస్ నగర్ లో రూ.40 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ఆయన ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన ప్రతి హామీని దశలవారిగా నెరవేరుస్తామన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీధర్ రెడ్డి, సురేందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed