ఆశావర్కర్లకు ఎమ్మెల్యే కిషోర్ బియ్యం పంపిణీ

by  |
ఆశావర్కర్లకు ఎమ్మెల్యే కిషోర్ బియ్యం పంపిణీ
X

దిశ, నల్లగొండ: కరోనా నియంత్రణలో ఆశావర్కర్ల సేవలు మరవలేనివని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆశావర్కర్లకు ఒక్కొక్కరికీ 20 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనాను గ్రామీణ స్థాయిలో కట్టడి చేసేందుకు ఆశావర్కర్లు నిత్యం ప్రజల్లో ఉంటున్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: mla kishore, tungaturthi, asha workers, rice distribution, nalagonda



Next Story

Most Viewed