- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలో నిన్న జరిగిన కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో పాతకక్షల నేపథ్యంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ తుపాకీతో హల్చల్ సృష్టించడమే కాకుండా ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాటిగూడలో జరిగిన ఘటన అమానుషం అని అన్నారు. రాజకీయ నాయకులు విచక్షణా రహితంగా ప్రవర్తించడం దారుణం అని విమర్శించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎంఐఎం నేత తుపాకులతో రెచ్చిపోయిన వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారని తెలిపారు. ఏ పార్టీ నేతలైనా కఠిన చర్యలు తప్పవు అని సూచించారు.
Next Story