పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

by  |
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
X

దిశ, నిజామాబాద్: ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌‌రెడ్డి సన్మానించారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తర్వాత వారితోనే కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో భాగమనీ, వారిని గౌరవించుకోవాలన్నారు. కరోనా కట్టడిలో వీరి సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జీవనన్న ఫౌండేషన్ ద్వారా 15వేల మందికి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీవన్‌తో పాటు మున్సిపల్ చైర్‌పర్సన్ పండిత్ వినీత ఉన్నారు.

Tags: sanitation workers, armoor, mla jeevan reddy, nizamabad

Next Story

Most Viewed