టీఆర్​ఎస్‌ది చెత్త రాజకీయం : జగ్గారెడ్డి

by  |
mla jaggareddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్​ఎస్​ చెత్త రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్​లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్​ఎస్​, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటేనని, చెత్త రాజకీయాలు చేస్తున్న పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్​ ఎన్నికల సమయంలో మంత్రి హరీష్​రావు పటాన్​చెరులో మకాం వేశాడని, ఈ నియోజకవర్గానికి మంత్రి హరీష్​రావు ఏం చేశాడో చెప్పాలని, ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ఇంటిని గెస్ట్​హౌస్​గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్​ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతరాజకీయాల కోసం కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందన్నారు. బండి సంజయ్‌కు భాగ్యలక్ష్మి ఆలయం ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed