అధికారులు రిటైర్ అయినా వదలిపెట్టం

by  |
అధికారులు రిటైర్ అయినా వదలిపెట్టం
X

దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే సిద్దిపేట కలెక్టర్ పదవి విరమణ అయ్యాక కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేయబోతున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రామలింగారెడ్డి మరణించినట్లే, చెరుకు శ్రీనివాస్‎రెడ్డి తండ్రి చెరుకు ముత్యంరెడ్డి మరణించారని.. అక్కడ భార్య ఉంటే, ఇక్కడ కొడుకు బరిలో ఉన్నారని తెలిపారు. రామలింగారెడ్డి మరణం బాధాకరమన్న జగ్గారెడ్డి.. దుబ్బాక అభివృద్ధిలో చెరుకు ముత్యం రెడ్డి మాత్రమే కనిపిస్తారని అన్నారు. చెరుకు శ్రీనివాస్‎రెడ్డికి దుబ్బాక ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలాగా వ్యవరిస్తున్నారని, ఆయనను వెంటనే బదిలీ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed