కేసీఆర్‌ను ఎప్పుడు జైల్లో పెడుతారో సంజయ్ చెప్పాలి !

by  |
కేసీఆర్‌ను ఎప్పుడు జైల్లో పెడుతారో సంజయ్ చెప్పాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయడానికి టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయని, రాజకీయ లబ్ధి కోసమే మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నా, సీఎం కేసీఆర్ హోంమంత్రి అమిత్ షాను కలవడంలో ఆంతర్యమేమిటన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడానికి కారణాలేంటని, ఢిల్లీలో సీఎంను జైల్లో పెడుతామని సంజయ్​ప్రకటించారని, కేసీఆర్‌ను ఎప్పుడు జైల్లో పెడతారో సంజయ్ చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఢిల్లీలో విందులు, గల్లీలో చిందులు వేస్తున్నాయని, పలు సందర్భాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్​మద్దతు పలికిందని ఎద్దేవా చేశారు.

Next Story