ఆలయాలు, దేవుళ్లేనా..పేదలను పట్టించుకోరా?

by  |
ఆలయాలు, దేవుళ్లేనా..పేదలను పట్టించుకోరా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజా సమస్యల పై మాట్లాడకుండా బండి సంజయ్ యువతను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు బండి సంజయ్‌కు గుర్తున్నాయా అంటూ చురకలు వేశారు. పేదల అకౌంట్‌లల్లో వేస్తామన్న రూ. 15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. వీటిపై బండి సంజయ్ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఆలయాలు, దేవుళ్ళు తప్ప పేదలు పడే ఇబ్బందులు గుర్తుకు రాట్లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాళీమాత భూముల గొడవ ముఖ్యమా.. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ముఖ్యామా అంటూ మండిపడ్డారు. ముందు కేంద్రంతో బండి సంజయ్ మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed