- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రైతులకు భారీ గుడ్ న్యూస్.. ముందుగానే వచ్చేసిన రుతుపవనాలు
![రైతులకు భారీ గుడ్ న్యూస్.. ముందుగానే వచ్చేసిన రుతుపవనాలు రైతులకు భారీ గుడ్ న్యూస్.. ముందుగానే వచ్చేసిన రుతుపవనాలు](https://www.dishadaily.com/h-upload/2024/05/19/336125-nairuthi.webp)
దిశ, వెబ్డెస్క్: భారత రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈ రోజు ఉదయం నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం ఈ రుతుపవనాలు మే 18 నుంచి 20 తేదీల మధ్యలో అండమాన్ తీరాన్ని తాకుతాయి.. ఇందులో బాగంగానే ఒక రోజు ముందుగా.. వచ్చాయని.. ఈసారి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరియన్ లోని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని.. మే 31న కేరళ, తీరానికి చేరుకుంటాయని.. జూన్ మొదటి వారంలో రాయలసీమకు ఆ తర్వాత వారంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు మొత్తం ఈ వర్షపాతం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో కురిసిన వర్షాల ఆదారంగానే పత్తి, వరి వంటి కీలక పంటలు సాగు చేస్తారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం అనుకున్న సమయానికి వర్షాలు వస్తుండటంతో రైతులు ఆనందంలో ఉన్నారు. అలాగే వ్యవసాయం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటున్నారు. కాగా ఈ సారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.