ఏ సమస్య వచ్చినా.. వెంటనే నాకు చెప్పండి : ఎమ్మెల్యే హరిప్రియ

by  |
MLA Haripriya
X

దిశ, ఇల్లందు: కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న జర్నలిస్టు శ్రావణ్‌రెడ్డిని ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రావణ్ రెడ్డి యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తనకు వెంటనే తెలియజేయాలని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరిసింగ్ నాయక్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బర్మావత్ సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed