కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలి

by  |
కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలి
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి స్థానిక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గ్రామాల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలను మరింత ప్రభావితం చేసేలా అవగాహన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం చేసే సూచనలను ప్రజలకు వివరించాలన్నారు. ముందుగా అన్ని మండలాలకు చెందిన ఎంపీడీవోలతో మాట్లాడుతూ.. అవసరమైతే ప్రతి గ్రామంలో మరియు కాలనీలలో వీధికి ఐదు మంది చొప్పున అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటనలు చేసి ప్రజలను మరింతగా చైతన్యం చేయాలని సూచించారు.

Next Story