వారిని గ్రామ గ్రామాన అడ్డుకోండి: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

by  |
వారిని గ్రామ గ్రామాన అడ్డుకోండి: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. అలాగే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అక్కడే బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై కుట్రలు చేస్తుందన్నారు. అలాగే రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడం దుర్మార్గం అని ఆయన నిప్పులు చెరిగారు.

ఇతర రాష్ట్రాల్లో వరి కొనుగోలు చేస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలు పెట్టడం బీజేపీ నేతల కపట నీతిగా అర్థమవుతుందన్నారు. కావున గ్రామాలలో బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు హాజరయ్యారు.

Next Story

Most Viewed