ఎమ్మెల్యే కొడుకుని.. నన్నే ఆపుతావా అంటూ చెంప పగులగొట్టాడు

by  |
ఎమ్మెల్యే కొడుకుని.. నన్నే ఆపుతావా అంటూ చెంప పగులగొట్టాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్దన్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచాడు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఉన్న ఏపీఆర్ కాలనీ సెక్యూరిటీ సిబ్బందిపై విష్ణువర్దన్ రెడ్డి చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కాలనీలోకి వెళ్తున్న క్రమంలో విధుల్లో భాగంగా సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ఆపారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణువర్దన్ రెడ్డి ‘నేను ఎమ్మెల్యే కొడుకుని, నన్నే గేటు ముందు ఆపుతావా అంటూ సిబ్బంది చెంప పగులగొట్టాడు.’ కాలనీలోని సీసీ టీవీ ఫుటేజీలో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.అంతకుముందు కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొడుకు బీజేపీ నేతలపై దాడికి పాల్పడిన ఘటనలో అప్పట్లో వార్తల్లోకెక్కాడు.

Next Story

Most Viewed