పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ

by  |
పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ
X

దిశ, ముషీరాబాద్: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే బోలక్‌పూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత పరికరాల కిట్లను అందించారు. అనంతరం కవాడిగూడలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ముఖేష్, పాఠశాల ప్రిన్సిపాల్ దేవదాసు, టీఆర్ఎస్ నాయకులు జయ సింహ, ముచ్చకూర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story