వైసీపీలో గంటా చేరికకు ముహూర్తం ఖరారు!

by  |
వైసీపీలో గంటా చేరికకు ముహూర్తం ఖరారు!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా అన్నిమాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆరోజు రానే వచ్చిందని తెలుస్తోంది.

ఆయనకు చేరికకు అధికార వైసీపీ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వచ్చే 9వ తేదీ నాడు ఆయన చేరికకు ముహుర్తం ఖరారైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆయన రాకను మంత్రి, భీమిలీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, నియోజక వర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed