అన్ని మతాలను గౌరవించడమే ప్రభుత్వ ఉద్దేశం: ఎమ్మెల్యే గండ్ర

by  |
అన్ని మతాలను గౌరవించడమే ప్రభుత్వ ఉద్దేశం: ఎమ్మెల్యే గండ్ర
X

దిశ, భూపాలపల్లి: రాష్ట్రంలోని అన్ని కులాలను, మతాలను గౌరవించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఆయన క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు.

భూపాలపల్లిలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున భూమి మంజూరు చేయాలని కలెక్టర్ ను కోరారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ.. భూపాలపల్లి లో చర్చిల మరమ్మతులు కోసం 77 లక్షలు మంజూరు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సునీత, మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి, ఆర్ డి ఓ శ్రీనివాస్, భూపాలపల్లి ఎమ్మార్వో ఇక్బాల్, జిల్లా కమిటీ రాజీవ్ పాస్టర్, క్రైస్తవులు పాల్గోన్నారు.

Next Story

Most Viewed