ప్రజల క్షేమం కోసం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

by  |
MLA Gandra Venkataramana Reddy
X

దిశ, భూపాలపల్లి: ప్రజల క్షేమం కోసమే దేవి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రజల క్షేమం కోసం దేవి నవరాత్రి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు మహా చండీయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు గండ్ర వెంకటరమణా రెడ్డి, జ్యోతి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed