సర్పంచ్‌లతో ఎమ్మెల్యే రహస్యమంతనాలు.. విషయం అదేనా ?

by  |
సర్పంచ్‌లతో ఎమ్మెల్యే రహస్యమంతనాలు.. విషయం అదేనా ?
X

దిశ, పరకాల: శాయంపేట మండల టీఆర్ఎస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ఆదివారం జిల్లా శాయంపేట మండలం‌లోని 22 మంది సర్పంచ్‌లు అధిష్టానానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి సర్పంచ్‌లతో ఫోన్‌లో మంతనాలు జరిపినట్లు సమాచారం. అంతర్గత విషయాలు ఏవైనా ఉంటే మనలో మనం చర్చించుకోవాలని కానీ ఇలా బహిరంగంగా పత్రికలకు చెప్పడం సరైంది కాదంటూ, పలువురు సర్పంచ్‌లను మందలించ్చినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జడ్పీ కార్యాలయంలో సర్పంచ్‌లందరితో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. సర్పంచ్‌‌లకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే కోరినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు సర్పంచులు తెలియజేస్తున్నారు.

epaper – MORNING EDITION (22-11-21) చదవండి

Next Story

Most Viewed