డబ్బులు ఎందుకివ్వలేదు.. పోస్టుమాస్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్

by  |
డబ్బులు ఎందుకివ్వలేదు.. పోస్టుమాస్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, ఆదిలాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేసిన పోస్టుమాస్టర్‌పై నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్త చేశారు. మంగళవారం ఆమె జన్నారం మండలం లింగయ్యపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు వెళ్లారు. దీంతో అక్కడి స్థానికులు తమకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే పోస్టుమాస్టర్‌తో మాట్లాడి డబ్బులు ఎందుకివ్వలేదు అని ప్రశ్నించారు. వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని, లేనట్టయితే సస్పెండ్ చేయిస్తానని హెచ్చరించారు.

Tags: MLA rekha nayak, Fire, Postmaster, adilabad, nirmal, rs 1500



Next Story

Most Viewed