బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

by  |
బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఓ బ్యాంకు ముందు ఖాతాదారులు గుమిగూడి ఉండటంతో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోని సదరు బ్యాంకు సిబ్బందిపై మండిపడ్డారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అన్నారు.

Tags: andole mla, chanti kranthi kiran, bank, jogipet, sangareddy, social distance, corona, virus,



Next Story