నా గెలుపు కోసం చాలా శ్రమించారు : ఈటల

by  |
నా గెలుపు కోసం చాలా శ్రమించారు : ఈటల
X

దిశ, ఫరూక్ నగర్ : హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను షాద్‌నగర్‌లో ఘనంగా సన్మానించారు. బీజేపీ స్థానిక నాయకుడు అందే బాబయ్య గృహప్రవేశ కార్యక్రమం కోసం ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మిథున్ రెడ్డి తదితరులు ఆదివారం పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, షాద్‌నగర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి ఈటల రాజేందర్, మిథున్ రెడ్డి‌లను భారీ గజమాలతో సన్మానించారు.

హుజురాబాద్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి పట్టణానికి వచ్చిన సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. షాద్‌నగర్, పాలమూరు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితర బృందం సభ్యులు హుజురాబాద్ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఎంతో శ్రమించారని.. వీరి సహకారం మరువలేనిదని ఈటల గుర్తుచేశారు. కార్యక్రమంలో స్థానిక నేత శ్రీ వర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, విజయ్ భాస్కర్, మోహన్ సింగ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed