కరోనాపై ఎమ్మెల్యే అత్యవసర సమావేశాలు

by  |

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కరోనా వైరస్‌ నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. రుద్రారం, లక్డారం, చిట్కుల్, పోచారం తండా, బాచుగూడెం, రామేశ్రరం బండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మార్వో, ఎంపీడీఓ, పోలీస్ శాఖ, ఆర్‌డబ్ల్యూ‌ఎస్, ఈవోపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

tags : patancheru MLA mahipal reddy, emergency meeting, Coronavirus, medak

Next Story

Most Viewed