ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే చల్లా

by  |
ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే చల్లా
X

దిశ, పరకాల: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17 వ డివిజన్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే రోడ్డు వెడల్పు పనులు చేపట్టామన్నారు. ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని తెలిపారు.

మంత్రి కేటీఆర్ సహకారంతో విలీన గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో 17 వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు, 16 వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్, తెరాస నాయకులు బెంబిరి బాబు రావు, తెరాస నాయకులు, ఇతర మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.



Next Story