క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

by  |
క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
X

దిశ‌ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ కోరారు. తానంటే గిట్టని వారు తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఓ కార్య‌క్ర‌మంలో తాను రిజర్వేషన్ అమలుపై చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆక్షేపించారు. బడుగు బలహీన వర్గాలతో తాను స్నేహపూర్వకంగా ఉంటానని స్పష్టం చేశారు. తనకు అందరి సహకారం ఉందని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరి మనసులైన నొచ్చుకుని ఉంటే మన్నించాలని కోరారు. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానని చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.


Next Story

Most Viewed