సీఎం సహాయనిధి పేదలకు ఆసరా: ఎమ్మెల్యే చల్లా

by  |
సీఎం సహాయనిధి పేదలకు ఆసరా: ఎమ్మెల్యే చల్లా
X

దిశ, పరకాల: ముఖ్యమంత్రి సహాయనిధి ఎందరో పేదలకు ఆసరాగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం హన్మకొండలోని ఆయన నివాసంలో మంజూరయిన చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నాయన్నారు.

తెరాస ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 14 లక్షల రూపాయల విలువైన చెక్కులను గీసుగొండ, నడికూడ మండలాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు.


Next Story

Most Viewed