బీజేపీ నేతలను నిలదీయండి.. దళితులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు

by  |
బీజేపీ నేతలను నిలదీయండి.. దళితులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు
X

దిశ, కమలాపూర్: ప్రజలకు పైసా పని చేయని బీజేపీ వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే నిలదీయాలని, రాష్ట్ర అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో బుధవారం జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంకు ముఖ్య అతిథిగా చల్లా ధర్మారెడ్డి హాజరయ్యారు. జూజూనూర్ పల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.

ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, వారిని కేవలం ఓట్లు వేసే యంత్రాలలాగా చూశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల స్థితిగతులను మార్చి.. ఆర్థికంగా బలోపేతం చేయడానికి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఇంత మంచి పథకాన్ని ప్రతి దళిత కుటుంబం సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ పైన ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed