- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విద్య, వాణిజ్యం, ఇతర రంగాల్లోనూ ఎంతో వేగంగా దూసుకుపోతున్న హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటినుంచీ పోరాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందూపురాన్ని జిల్లా చేయడం కోసం అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని మండిపడ్డారు.
Next Story