ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో విషాదం

by  |
ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంట్లో విషాదం
X

దిశ, నిజామాబాద్ రూరల్: ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది ఆయన భార్య శోభారాణి (59) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ సర్పంచ్లు, ఎంపీటీసీలు బాజిరెడ్డి గోవర్ధన్ భార్య శోభ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని టీఆర్ఎస్ నాయకులు కోరుకున్నారు.

ఇది ఇలా ఉండగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శోభారాణి మరణం పట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు.

Next Story