- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అమరావతిలో అసలు ఉద్యమమే లేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో పెద్ద స్కామ్ జరిగిందని.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ బినామీలతో వేల ఎకరాలు కొన్నారని అంబటి ఆరోపించారు. బలహీన వర్గాల భూములు తక్కువ ధరలకు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ధ్వజమెత్తారు.
అమరావతి స్కామ్లో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామని.. మరికొంత మందిని అరెస్ట్ చేస్తామని అంబటి స్పష్టం చేశారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ జరుగుతుంటే చంద్రబాబు పారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అమరావతిలో భూస్వాముల ఉద్యమం జరుగుతోందన్నారు.
Next Story