సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..

by  |
సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి శనివారం ప్రగతిభవన్లో ప్రత్యేకంగా కలిశారు. అడ్డాకుల మండలం బలిదుపల్లి నుండి సీసీ కుంట మండలం వెంకంపల్లి వరకు రోడ్డు నిర్మాణం సక్రమంగా లేకపోవడం, నియోజక వర్గంలోని సమస్యలు గురించి సీఎం కు ఎమ్మెల్యే తెలిపారు. బిటి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

అలాగే నియోజక వర్గంలోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే బడ్జెట్లో ఈ పనులకు నిధులను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారని సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed