పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాదాభివందనం

by  |
పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పాదాభివందనం
X

దిశ, వరంగల్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మంగళవారం జనగామలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారిని శాలువాలతో సన్మానించి పాదాభివందనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేసిన మరువలేనివని కొనియాడారు. కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కాగా పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించారని వారు పేర్కొన్నారు.


Next Story

Most Viewed