జవహర్ నగర్ పీఎస్ పరిధిలో వేరు వేరు చోట్ల మహిళ, యువతి మిస్సింగ్

by  |
Missing
X

దిశ, జవహర్‌నగర్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ, యువతి అదృశ్యమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. సీఐ భిక్షపతి వివరాల ప్రకారం.. యాప్రాల్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన బండి హన్సరాజ్‌కు తన భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వృత్తి రీత్యా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. తన పెద్ద కూతురు హర్షిత(20) ఇంటర్ పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 26న హర్షిత పుట్టినరోజు కావడంతో లాల్ బజార్‌లోని నాగదేవత గుడికి వెళ్తానని చెప్పడంతో వారు నిరాకరించారు. కాగా, అదే రోజు సాయంత్రం ఇంట్లో నుండి బయటకెళ్లిన హర్షిత అదృశ్యమైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆరు నెలల క్రితం సురేష్ అనే యువకుడ్ని ప్రేమిస్తున్నట్లు చెప్పిన హర్షిత తరచూ ఫోన్ మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీంతో హర్షిత తల్లిందండ్రులు సురేష్‌పై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరో మహిళ

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లోని ఓ ఇంట్లో దియ్యేస్ పటేల్, జిజ్ఞాస దంపతులు అద్దెకు నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా దియ్యేస్ పటేల్ ఈ నెల 22 గుజరాత్‌కి వెళ్లాడు. జిజ్ఞాస(30) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇదే క్రమంలో ఉద్యోగానికి వెళ్లిన ఆమె ఈనెల 26న అదృశ్యమైంది. దియ్యేస్ పటేల్ భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా జిజ్ఞాస ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Next Story