- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చార్మినార్: సోదరి కూతురు వివాహానికి వెళ్లొస్తానని భార్య, కుమారుడు, కుమార్తె అదృశ్యమైన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట హాషామాబాద్కు చెందిన మహ్మద్ అశ్వాక్ హస్సేన్ పాన్ షాప్ నిర్వాహకుడు. మహ్మద్ అశ్వాక్.. షహనాజ్ బేగం(48)ను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే, ఇతనికి ఇదివరకే పెళ్లియ్యింది. ఒక కూతురు అంజుమ్ఐరా(12), కుమారుడు మహ్మద్ అక్బర్(14) ఉన్నాడు. ఈ నెల 23న జీఎం కాలనీలో సోదరి కూతురు వివాహానికని షహనాజ్బేగం.. కూతురు అంజుమ్ఐరా, కుమారుడు మహ్మద్ అక్బర్ లను తీసుకుని వెళ్లింది. కానీ, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో భర్త మహ్మద్ అశ్వాక్ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.