ఫలక్​నుమాలో తల్లీ, కూతురు మిస్సింగ్

by  |
missing
X

దిశ, చార్మినార్​: తల్లీకూతురు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన ఫలక్‌నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఫలక్​నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫాతిమానగర్​కు చెందిన షేక్​ జాఫర్​, అమీనాబేగం(33) దంపతులు. వీరికి 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం . ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు అమీనాబేగంతో పాటు చిన్న కూతురు తయ్యబా ఫాతిమా (6) ఇంట్లో కనిపించకపోవడంతో షేక్​ జాఫర్​ వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజం కనిపించకపోవడంతో ఫలక్​నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఫలక్​నుమా పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed