భారీ దొంగతనం.. సాయంత్రానికి ఇంట్లోనే ప్రత్యక్షం

by  |
భారీ దొంగతనం.. సాయంత్రానికి ఇంట్లోనే ప్రత్యక్షం
X

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికుడి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు సమాచారం రావడంతో ఉదయం విచారణ చేపట్టగా.. సాయంత్రానికి కనిపించకుండా పోయిన బంగారం ఇంట్లోనే ప్రత్యక్షం కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. గోదావరిఖని దుర్గా నగర్‌కు చెందిన అంకేశ్వరం రామ్మూర్తి అనే సింగరేణి కార్మికుడి ఇంట్లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి 10 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 లక్షల నగదును అపహరించుకుపోయారని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో పోయిన నగదు, బంగారం ఇంట్లోనే ప్రత్యక్షం కావడంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.



Next Story

Most Viewed