వీడిన మిస్సింగ్ మిస్టరీ.. చెరువులో శవాలుగా తేలిన ముగ్గురు చిన్నారులు

by  |
sunk childrens
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. నిన్న కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు మంగళవారం గ్రామంలోని చెరువులో విగతజీవులుగా కనిపించారు. వివరాల్లోకివెళితే.. ఆగిరిపల్లికి చెందిన చంద్రిక, జగదీశ్, శశి అనే ముగ్గురు చిన్నారులు సోమవారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. చిన్నారుల కోసం పేరెంట్స్ గాలింపుచర్యలు కొనసాగించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈరోజు ఉదయం గ్రామంలోని చెరువులో మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా, కనిపించకుండాపోయిన ఆ ముగ్గురు చిన్నారుల అని తేలింది. విషయం బాధిత కుటుంబ సభ్యులు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయారా? లేక ఎవరైనా కావాలనే హత్యచేసి చెరువులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed