అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం

by  |
అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో అదృశ్యమైన చిన్నారి సౌమ్య కథ విషాదాంతంగా ముగిసింది. ఎల్లారెడ్డి మండలం మత్తమాల నిజం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో సౌమ్య మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఇంటి ఆవరణంలో ఆడుకుంటున్న సౌమ్య కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, చిన్నారి మృతదేహం నిజాంసాగర్ బ్యాక్ వాటర్‎లో కనిపించడంతో తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను నింపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story