కాలువలో గల్లంతైన మృతదేహాలు లభ్యం..!

by  |
కాలువలో గల్లంతైన మృతదేహాలు లభ్యం..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఈతకు వెళ్లి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఎన్ఎస్‎పీ కాలువలోకి ఈతకు వెళ్లిన గంధం వాసు, తెల్లకుల హర్షవర్ధన్‎లు గల్లంతయ్యారు. దీంతో వీరిద్దరి మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed