- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో పాటు ఆయన కారు డ్రైవర్, పర్సనల్ పొటో గ్రాఫర్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి కొండలరావు తెలిపారు. రోజురోజుకూ మిర్యాలగూడలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భాస్కర్కు కరోనా సోకడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు కరోనా రావడంతో అందులో పాల్గొన్న వారంతా ఇప్పుడు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రస్తుతం భాస్కరరావు మిర్యాలగూడలోని తన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. రెండ్రోజుల కిందట పరీక్షలు చేయించుకోగా బుధవారం ఆయనకు పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యే బంధువుతో పాటు మిర్యాలగూడ పట్టణంలోని ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లోని ఓ ఎమ్మార్వో, ఇద్దరు రెవెన్యూ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.
Next Story