బంగ్లాదేశ్‌కు మొదటి మిర్చి రైలు

by  |
బంగ్లాదేశ్‌కు మొదటి మిర్చి రైలు
X

దిశ, న్యూస్ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఆంధ్రప్రదే‌శ్‌లోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెం నుంచి మొట్టమొదటి మిర్చి పార్సిల్‌ను రైలు ద్వారా బంగ్లాదే‌శ్‌లోని బినాపోలుకు రవాణా చేసింది. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న మిరప పంటను రైళ్ల ద్వారా రవాణా చేసేందుకు ఈ సర్వీసును ప్రారంభించారు. రైల్ ద్వారా రవాణా చేయాలంటే కనీసం 15వేల టన్నుల లోడ్ తప్పనిసరి, అయితే గరిష్టంగా 500 టన్నుల సరుకును కూడా రవాణా కల్పించేందు గుంటూరు డివిజన్ పరిధిలో మొదటిసారి అనుమతినిచ్చారు. 16 పార్సిల్ వ్యాన్లు కలిగిన ప్రత్యేక పార్శిల్ రైల్లో 384 మెట్రిక్ టన్నుల ఎండు మిర్చిని తరలించినట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

Next Story